టాప్‌ సీడ్‌ జోడీని ఓడించిన అనిరుధ్‌–అర్జున్‌ ద్వయం | Anirudh and Arjun duo defeated the top seed pair | Sakshi
Sakshi News home page

టాప్‌ సీడ్‌ జోడీని ఓడించిన అనిరుధ్‌–అర్జున్‌ ద్వయం

Jul 19 2024 4:06 AM | Updated on Jul 19 2024 4:06 AM

Anirudh and Arjun duo defeated the top seed pair

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అనిరుద్‌–అర్జున్‌ ఖడే (భారత్‌) ద్వయం 6–3, 3–6, 10–7తో టాప్‌ సీడ్, 28వ ర్యాంక్‌ జోడీ లామోన్స్‌ –విత్రో (అమెరికా)ను బోల్తా కొట్టించింది.  ప్రస్తుతం అనిరుధ్‌ 128వ ర్యాంక్‌లో, అర్జున్‌ 111వ ర్యాంక్‌లో ఉన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement