జహీరాబాద్ టౌన్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ’శక్తి’ డిపార్ట్మెంట్ పరిధిలోకి మార్చడాన్ని నిరసిస్తూ రంజోల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిరసన బాట పట్టారు. గత 31 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఈ నెల 18 నుంచి 21 వరకు జరగాల్సిన మిడ్ సెమిస్టర్ పరీక్షలను సంపూర్ణంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా సాంకేతిక విద్య శాఖ కమిషనర్ దేవసేన జేఏసీ నాయకులను అవమానించడాన్ని ఖండిస్తూ కళాశాల సిబ్బంది విద్యార్థుల నిర్ణయానికి మద్దతు తెలిపారు. కమిషనర్ వైఖరికి నిరసనగా తాము సైతం సెమిస్టర్ పరీక్షల విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.


