సమస్యలకు భక్తి మార్గమే పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు భక్తి మార్గమే పరిష్కారం

Aug 25 2025 9:02 AM | Updated on Aug 25 2025 9:02 AM

 సమస్యలకు భక్తి మార్గమే పరిష్కారం

సమస్యలకు భక్తి మార్గమే పరిష్కారం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు భక్తి మార్గమే పరిష్కారమని రామకృష్ణ మఠం స్వామీజీ తత్పదానంద మహరాజ్‌, ప్రతినిధి సూర్య ప్రకాశ్‌ పేర్కొన్నారు. శ్రీరామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయ ఆవరణలో సత్సంగం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదా దేవిల జీవితం, బోధనలు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీరామకృష్ణ సేవాసమితి జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌, కార్యదర్శి రాజేశ్వర్‌రావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement