బంగారు బోనం
పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం బల్కంపేట ఎల్లమ్మకు బంగారు బోనం సమర్పించారు. ఉదయం ఆలయానికి తీసుకుని వచ్చిన బోనంకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ స్వాగతం పలికారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాల్లో చివరి ఘట్టమైన రథోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. పురవీధుల్లో సంప్రదాయ నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు..మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య రథయాత్ర కన్నులపండువగా సాగింది. – అమీర్పేట/చార్మినార్


