దౌల్తాబాద్: పాముకాటుకు ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఖాజాషా(60) ఉదయం తన సొంత పొలంలో గడ్డి కోస్తున్నారు. ఈ క్రమంలో చేతికి పాము కాటు వేసింది. వెంటనే గమనించి ఇంటికి వచ్చారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విషం శరీరంలోకి పాకడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడి కుమారుడు మదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ వేణుకుమార్ తెలిపారు.


