ప్రజలు వ్యాయామ చేసేందుకు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేక ఎక్కడికక్కడ విరిగిపోయి కనిపిస్తున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో రూ.80లక్షలతో 16 ప్రాంతాల్లో ఓపెమ్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పనికిరాకుండా పోయాయి. పాడయిన పరికరాలను చాలా రోజులుగా మరమ్మతు చేపట్టడం లేదు. పరికరాలు సరిగా లేక వ్యాయామం చేయలేకపోతున్నామని ఉదయం వాకింగ్ వెళ్లేవారు, క్రీడాకారులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సిరిసిల్ల అర్బన్


