న్యూస్రీల్
ఆర్టీసీ బస్సు ఎదుట ఆందోళన తెలుపుతున్న దేవునితండా వాసులు
మృగశిర వచ్చింది.. మీనం మెరిసింది !
మృగశిర కార్తె సోమవారం ప్రవేశించింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో ముదిరాజ్ కులస్తులు 230 కుటుంబాలు గ్రామచెరువులో చేపలు పట్టాయి. కులస్తులతోపాటు చేపలు కొనేందుకు వచ్చిన గ్రామస్తులతో చెరువు పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉబ్బసం వ్యాధి నివారణకు సంప్రదాయంగా వస్తున్న చేపమందును సిరిసిల్ల మార్కెట్లో చంద్రంపేటకు చెందిన రామచంద్రం పంపిణీ చేశారు. కిలో రవు చేపలు రూ.200, బొమ్మెలు రూ.400, రొయ్యలు రూ.400 ధర పలికాయి.
– సిరిసిల్లటౌన్/సాక్షి ఫొటోగ్రాఫర్


