ఎండలు మండుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ పార్క్లోగల స్విమ్మింగ్పూల్లో విద్యార్థుల సందడి నెలకొంటుంది. ఈత నేర్చుకునేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. నిర్వాహకులు ఉదయం, సాయంత్రం వేళల్లో బ్యాచ్ల వారీగా స్విమ్మింగ్లో శిక్షణ ఇస్తున్నారు. కొందరు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు స్విమ్మింగ్పూల్ను ఆశ్రయిస్తున్నారు. అన్ని రకాల రక్షణ చర్యలు పాటిస్తూ ఈత కొడుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల


