నిధులు మంజూరు కాగానే పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు అందజేస్తాం. చిన్న పంచాయతీల్లో కొంత ఇబ్బంది ఉన్నా వారికి కూడా త్వరలోనే వేతనాలు మంజూరు చేస్తాం.
– షరీఫొద్దీన్,
జిల్లా పంచాయతీ అధికారి
ముస్తాబాద్ మండలం రామ్రెడ్డిపల్లె గ్రామం. నేను ఐదేళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నా. మూడునెలలుగా జీతం రావడం లేదు. అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనం మంజూరు చేయాలి.
– గద్దల సుధాకర్,
కార్మికుడు, రామ్రెడ్డిపల్లె, ముస్తాబాద్
పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయా లి. కొన్ని పంచాయతీల్లో మూడు నుంచి ఆరునెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. అధికారులు స్పందించి త్వరగా మంజూరు చేయాలి. – అన్నల్దాస్ గణేశ్,
గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా బాధ్యులు


