సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ప్రమాదం పొంచి ఉంది. మున్సిపల్ డ్రైనేజీపై వేసిన సిమెంట్ మూతలు శిథిలం కావడంతో ఆదమరిస్తే.. చాలు.. కాలు విరగడం ఖాయమన్నట్లుగా ఉంది. ఇప్పటికే పలువురు ఆ శిథిలాల్లో పడి గాయపడ్డారు. మున్సిపల్ అధికారులు షాపుల అద్దైపె ఆసక్తి చూపుతున్నారే తప్ప.. ఆ షాపుల ముందు పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


