పల్లైపె పట్టు.. శిక్షణే మెట్టు
● వార్డుసభ్యులకు ఐదు రోజుల శిక్షణ ● పాలన, అభివృద్ధి పనులపై అవగాహన ● గ్రామాభివృద్ధికి పాటుపడతామంటున్న ఉపసర్పంచులు, వార్డుసభ్యులు
వేములవాడరూరల్: పల్లెల్లో పడకేసిన అభివృద్ధి పనులను గాడిలో పెట్టడం.. పాలనపై పట్టు సాధించడం.. ప్రజలతో మమేకమై ముందుకెళ్లడం.. వంటి అంశాలపై ప్రభుత్వం వార్డుసభ్యులకు శిక్షణ ఇస్తుంది. ఇందులో భాగంగా గత ఐదు రోజులుగా వేములవాడరూరల్ మండలంలోని ఎనిమిది గ్రామాల ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు ఇస్తున్న శిక్షణ శుక్రవారం ముగిసింది. ఎనిమిది గ్రామాల నుంచి 70 మంది వార్డుసభ్యులు హాజరుకాగా మహిళా ప్రజాప్రతినిధులే ఎక్కువగా వచ్చారు. ఈ ఐదు రోజులు రానున్న ఐదేళ్లలో చేయాల్సిన పనులపై అవగాహన కల్పించారు. ఈ ఐదు రోజుల శిక్షణ తమకెంతో అవగాహన కల్పించిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..


