
ఘోర రోడ్డు ప్రమాదం
యర్రగొండపాలెం: మండలంలోని అనకుంట సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో 28 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మిగిలిన వారంతా యర్రగొండపాలెంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యర్రగొండపాలెం మండలంలోని చెన్నరాయునిపల్లెకు చెందిన కూలీలు బొప్పాయి కోతల కోసం ఐషర్ వాహనంలో మార్కాపురం వైపు వెళ్తున్నారు. అనకుంట వద్దకు రాగానే.. తిరుపతి నుంచి పల్నాడు జిల్లా గురజాలకు మామిడికాయల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం టైరు పగిలింది. ఈ వాహనం అదుపుతప్పి ఎదురుగా కూలీలతో వస్తున్న ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని చర్లతిరుమలాపూర్కు చెందిన ఐషర్ వాహన డ్రైవర్ శీల కుమారస్వామి (42) వాహనంలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. అదే రాష్ట్రంలోని మిర్యాలగూడెంకు చెందిన బొలేరో వాహన డ్రైవర్ సందీప్కు తీవ్రగాయాలయ్యాయి. ఐషర్ వాహనంలో వెళ్తున్న కూలీలు కె.రత్తాలు, ఎం.తిమ్మయ్య, ఆర్.మల్లేశ్వరి, ఎం.చెన్నమ్మ, బి.అనిల్, ఎం.రవణమ్మ, కె.చెన్నమ్మ, పి.వెలుగొండ, పి.రాజు, కె.చిన్నలత, ఎన్.పెద్దమల్లయ్య, ఎం.బ్రహ్మయ్య, ఎం.ఏసుబాబు, కె.అభిలాష్, ఎం.దీప్తి, వి.వెంకటనారాయణ, డి.రమేష్నాయక్, ఎం.లింగయ్య, కె.చెన్నయ్య, కె.వరలక్ష్మి, కె.చెన్నకేశవులు, ఎన్.ఆదిలక్ష్మమ్మ, ఎస్.వెంకటరమణ, ఎం.శ్రీను, కె.చెన్నయ్య, బి.ఎల్లయ్య, షేక్.సైదాలకు గాయాలయ్యాయి.
బొలేరో వాహన డ్రైవర్ సందీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. యర్రగొండపాలెం ఎస్సై పి.చౌడయ్య ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను వైద్యశాలలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
టైరు పగిలి అదుపుతప్పిన మామిడికాయల లోడు వాహనం
కూలీలు వెళ్తున్న వాహనాన్ని ఢీ
ఒకరు మృతి, 28 మందికి గాయాలు
క్షతగాత్రులంతా కూలీలు
యర్రగొండపాలెం మండలం అనకుంట సమీపంలో ఘటన

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం