
పోలిరెడ్డికి భారత్ విద్యా విభూషణ్ అవార్డు
గిద్దలూరు రూరల్: స్థానిక ఎస్వీ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.పోలిరెడ్డికి ఇంటర్నేషనల్ అమెరికన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వారు భారత్ విద్యా విభూషణ్ అవార్డు అందజేశారు. ఈ అవార్డును చైన్నెలో ఈనెల 12న సంస్థ జాయింట్ డైరెక్టర్ సి.కృష్ణ చేతుల మీదుగా డా.పోలిరెడ్డి అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కళాశాల ప్రాంగణంలో ఆయన్ను సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ సూరం నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల సాహిత్య పరిశోధనలో చూపిన విశిష్ట ప్రతిభకు, ఉన్నత విద్య ఆధ్యాత్మిక రంగాల్లో చేస్తున్న విశేష కృషిని గుర్తించిన సంస్థ ఈ అవార్డును అందజేసింది. గతంలోను పోలిరెడ్డి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డితో పాటుగా అధ్యాపక బృందం ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.