
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
● ఇరువర్గాల ఆమోదంతోనే కేసుల
పరిష్కారం
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ
చైర్మన్ ఎ.భారతి
ఒంగోలు: జాతీయ లోక్ అదాలత్లో ఇరువర్గాల ఆమోదంతోనే కేసుల పరిష్కారమవుతాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీకి అర్హత కలిగిన అన్ని క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు, చెక్బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలు, అన్ని రకాల సివిల్ కేసులు ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమ తీర్పు అని, ఇక్కడ పరిష్కారమైన కేసులకు సంబంధించి కోర్టుల్లో చెల్లించిన ఫీజును కూడా వాపస్ పొందవచ్చని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రీసిట్టింగ్ రూపంలో ఇరువర్గాల ఆమోదంతో ముందస్తుగా వ్యాజ్యాలు పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారని, పోలీసు అధికారులు, న్యాయవాదులు, అధికారులు పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు.
యోగాలో డ్వాక్రా
మహిళలు పాల్గొనాలి
ఒంగోలు సబర్బన్: ఈనెల 20వ తేదీన స్వయం సహాయక సంఘాల సభ్యులతో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం, పీవీఆర్ స్కూల్ గ్రౌండ్, ఏబీఎం స్కూల్ గ్రౌండ్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలిచ్చారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మెప్మా, డీఆర్డీఏ పీడీలు శ్రీహరి, నారాయణ, డీఎస్డీఓ రాజరాజేశ్వరి తదితరులు ఉన్నారు.
డప్పు కళాకారుల పోరాట సమితి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఏసమ్మ
మార్కాపురం: మాదిగ, చర్మ, డప్పు కళాకారుల పోరాట సమితి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా శిరిగురి ఏసమ్మను నియమించినట్లు సమితి రాష్ట్ర అధ్యక్షుడు సండ్రపాటి కాలేబు మాదిగ మంగళవారం తెలిపారు. ఈమె కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామ మాజీ ఎంపీటీసీగా పనిచేశారు. ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు 2 ఎకరాల సాగుభూమిని ప్రభుత్వం పంపిణీ చేయాలని, 40 సంవత్సరాలు నిండి అర్హులైన చర్మ డప్పు కళాకారులకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యవర్గం తీర్మానించిందని అన్నారు.
ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి
పీసీపల్లి: ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం పీసీపల్లి మండలంలోని బట్టుపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెద్దన్నపల్లికి చెందిన అరటివేముల మహేష్(38) వ్యవసాయ పనులతో పాటు బేల్దారి మేసీ్త్రగా కూడా చేస్తుంటాడు. పీసీపల్లిలో ఓ ఇల్లు నిర్మించేందుకు ఒప్పుకొన్నాడు. భవనానికి అవసరమైన ఇనుము ఇతర సామగ్రిని తన సొంత ట్రాక్టర్లో కనిగిరి నుంచి తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో బట్టుపల్లి వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి ఇంజన్ తిరగబడింది. ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కోటయ్య పరిశీలించారు. జేసీబీ సాయంతో ట్రాక్టర్ను తొలగించి, మహేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు మహేష్కు భార్య స్రవంతి, కూతురు, కుమారుడు ఉన్నారు. భర్త అకాల మరణంతో భార్య స్రవంతి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.