
జూమ్ విధానంలోనే వైద్యశాఖలో బదిలీలు
ఒంగోలు టౌన్: వైద్యశాఖలో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. మంగళవారం తొలిరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన బదిలీల ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. మాన్యువల్గా బదిలీలు చేపట్టాలని వైద్య ఉద్యోగులు ఎంతగా ప్రాధేయపడిన పెడచెవిన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తను అనుకున్నట్లే జూమ్ విధానంలో బదిలీలు చేపట్టింది. వీరిలో ల్యాబ్ టెక్నీషియన్లు 12, జూనియర్ అసిస్టెంట్లు 5, టైపిస్టులు 3, ఎల్డీ కంప్యూటర్ 5, డ్రైవర్లు 11, ఆఫీసు సబార్డినేటర్లు 31, ఎంఎన్ఓలు 1, ఎఫ్ఎన్ఓలు 4, స్వీపర్లు నలుగురు ఉన్నారు. తొలిరోజు మొత్తం 80 మందిని బదిలీ చేశారు. బుధవారం జిల్లాలోని 132 మంది ఏఎన్ఎంలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సిబ్బంది ప్రాధాన్యత ప్రకారం వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీలు చేసినట్లు జిల్లా వైద్య అరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో జిల్లా పరిపాలనాధికారి గీతాంజలి, సూపరింటెండెంట్ రాజేష్, డేటా మేనేజర్ ప్రభాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కెరీర్ గైడెన్స్ ఎంతో కీలకం
ఒంగోలు సబర్బన్: విద్యార్థి దశలోనే భవిష్యత్తుపై ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, సాధించే దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సూచించారు. మంగళవారం స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రూట్ టు రైజ్ థ్రైవ్ ఫౌండేషన్, బాలల వనరుల కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన ఉజ్వల భవిష్యత్తు కార్యక్రమనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, పాఠాలతోపాటు ఇతర అంశాల్లోనూ రాణించాలని చెప్పారు. ప్రపంచ విజేతల జీవితాలను నిత్యం అధ్యయనం చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాల వివరాలను నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ టి.వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీవైఈఓ చంద్రమౌలేశ్వరరావు, డీసీపీఓ దినేష్ కుమార్, బంగారు బాల్యం నోడల్ ఆఫీసర్ గిరిధర్శర్మ, రూట్ టు రైజ్ థ్రైవ్ వ్యవస్థాపకురాలు రషీద, హెచ్ఎం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
మాన్యువల్ విధానంలో చేయాలన్న ఉద్యోగుల వినతిని పట్టించుకోని ప్రభుత్వం
తొలిరోజు 80 మంది బదిలీ

జూమ్ విధానంలోనే వైద్యశాఖలో బదిలీలు