
చూసి వెళ్లండోయ్.. నడుములిరుగుతయ్!
రోడ్ల మరమ్మతులు చేపట్టాలి
మండల కేంద్రమైన పామూరు నుంచి నెల్లూరు వెళ్లే 565 జాతీయ రహదారి వరకు, కందుకూరు వెళ్లే 167బీ జాతీయ రహదారి వరకు కనెక్టివిటీ రోడ్లు సరిగా లేవు. రోడ్డంతా గుంతలు, సరిలేని మార్జిన్ల వల్ల భయభయంగా వెళ్లాల్సి వస్తోంది. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కట్టకిందపల్లె, కరోళ్లపాడు రోడ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.
– అంబటి కొండారెడ్డి, పామూరు
నిధులు రాగానే నిర్మిస్తాం
పామూరు మండలంలోని 30వ మైలు వద్ద నుంచి కరోళ్లపాడు వరకు రూ.3.25 కోట్లతో నూతన రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
– ఎలీషా, జేపీ,
పీఐయూ వర్క్స్
పామూరు:
మండల కేంద్రమైన పామూరు సరిహద్దుల్లో హైవే కనెక్టివిటీ రోడ్లతోపాటు గ్రామీణ రహదారులు గోతులమయంగా మారయి. పామూరు నుంచి కందుకూరు వెళ్లే 167బీ జాతీయ రహదారి కనెక్టివిటీ రోడ్డుపై సీహెచ్సీ సమీపంలో గోతులు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు కొంతదూరం సింగిల్ రోడ్డు కావడం, మార్జిన్లలో గోతులు ఉండటంతో వాహనదారులు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఆ ప్రాంతంలో కమ్యూనిటీ వైద్యశాల, ప్రైవేట్ వైద్యశాల ఉన్న ఈ హైవే కనెక్టివిటీ రోడ్డులో నిత్యం వాహనాల రాకపోకలు అధికంగానే ఉంటాయి. దీంతో ఏ క్షణం ప్రమాదం బారిన పడతామోనని వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు.
● పామూరు నుంచి నెల్లూరు వెళ్లే 565 నేషనల్ హైవే కనెక్టివిటీ రోడ్డు సింగిల్ది కావడం, సైడు మార్జిన్లు గుంతలమయంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రెండు రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చి ప్రమాదాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పల్లె దారుల్లో నరకయాతన
పామూరు మండలంలోని పంచాయతీరాజ్ రోడ్లు వాహనదారులకు చుక్కలు చూపుతున్నాయి. మండలంలోని 30వ మైలు వద్ద నుంచి తూర్పు కట్టకిందపల్లె, కరోళ్లపాడు వెళ్లే పంచాయతీరాజ్ రోడ్డు గోతులమయంగా మారింది. ఈ రోడ్డులో నిత్యం వందల సంఖ్యలో ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూల్ బస్సులు తిరుగుతుంటాయి. హైస్కూల్, జూనియర్, డిగ్రీ, బీఈడీ, డైట్ కళాశాలల విద్యార్థులు రోజూ రాకపోకలు సాగించే ఈ రోడ్డును బాగు చేయాలని పడమటి కట్టకిందపల్లె, కరోళ్లపాడు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గోతుల మయంగా తూర్పు
కట్టకిందపల్లె, కరోళ్లపాడు రోడ్డు
ఏడాదైనా.. స్పందన సున్నా..
రహదారుల మరమ్మతులపై కూటమి సర్కారు చేసిన ప్రకటనలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతన కుదరడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

చూసి వెళ్లండోయ్.. నడుములిరుగుతయ్!

చూసి వెళ్లండోయ్.. నడుములిరుగుతయ్!

చూసి వెళ్లండోయ్.. నడుములిరుగుతయ్!

చూసి వెళ్లండోయ్.. నడుములిరుగుతయ్!