ప్రతి నెలా వేతనాలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి నెలా వేతనాలు చెల్లించాలి

Jun 16 2025 7:11 AM | Updated on Jun 16 2025 7:11 AM

ప్రతి

ప్రతి నెలా వేతనాలు చెల్లించాలి

ఒంగోలు టౌన్‌:

ప్రతి నెలా క్రమం తప్పకుండా 104 సిబ్బందికి వేతనాలు చెల్లించాలని 104 ఎంఎంయూ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు తీసుకున్న భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులు, సిబ్బంది పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. గత రెండు నెలలుగా వేతనాలు రాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాల్లో సీనియార్టీ ప్రకారం బదిలీలు చేసి మిగతా స్థానాల్లో కొత్తగా నియామకాలు చేపట్టాలన్నారు. 2020 జూలైలో జాయినైన ఉద్యోగులకు కూడా స్లాబ్‌ సిస్టం అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా గ్రీవెన్స్‌ మీటింగులు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో యూనియన్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

శాంతి భద్రతలను పరిరక్షించాలి

సింగరాయకొండ:

శాంతి భద్రతలను పకడ్బందీగా పరిరక్షించాలని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ పోలీసులకు సూచించారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని, పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని, ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని, మహిళలను గౌరవించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని ఆదేశించారు. రికార్డులు పరిశీలించి పెండింగ్‌ కేసులు త్వరగా పరిష్కరించాలని చెప్పారు.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఐ సీహెచ్‌ హజరత్తయ్య, ఎస్సై బి.మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతి నెలా వేతనాలు  చెల్లించాలి 
1
1/1

ప్రతి నెలా వేతనాలు చెల్లించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement