
కోలాహలంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ
● గోవింద నామస్మరణతో మార్మోగిన శ్రీగిరి మాడ వీధులు
ఒంగోలు మెట్రో: జ్యేష్ట మాసం శ్రవణా నక్షత్రం ఆదివారం ఉదయం ఐదు గంటలకు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కోర్టు సెంటర్ వద్ద బాపూజీ గోశాలలో గోపూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో శ్రీవారి ఉత్సవమూర్తిని ఉంచి భక్తులు పల్లకిని మోస్తూ సామూహికంగా గోవింద నామాలు పటిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణలో వాసవి కోలాట భజన మండలి సభ్యులు కోలాటం ప్రదర్శించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పతంజలి యోగ మిత్ర మండలి యోగా గురువు గోపాల్ రెడ్డి తమ శిష్య బృందం సేవ సహకారంతో నిర్వహించారు. కార్యక్రమంలో గిరిప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు రాధా రమణ గుప్తా జంధ్యం, కోశాధికారి వలేటి కృష్ణారావు, ధనిశెట్టి రాము నాయుడు, సెనెగేపల్లి నాగాంజనేయులు, యోగా గురువు గోపాల్ రెడ్డి, మురళి, ఈశ్వరయ్య, దేసు కృష్ణ, ఆంజనేయులు, వాసవి కోలాట భజన మండలి సభ్యులు రేఖ, అరవింద లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.