తల్లిడిల్లి | - | Sakshi
Sakshi News home page

తల్లిడిల్లి

Jun 17 2025 6:49 AM | Updated on Jun 17 2025 6:49 AM

తల్లి

తల్లిడిల్లి

పారిశుద్ధ్య కార్మికులు..

తల్లి వందనం కష్టాలు పారిశుద్ధ్య కార్మికులనూ వెంటాడుతున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అమ్మఒడి ద్వారా ఆర్థిక సాయాన్ని అందుకున్న కుటుంబాలు నేడు ఆందోళన చెందుతున్నాయి. తల్లికి వందనం పథక నిబంధనలు వీరికి వర్తించవంటూ ప్రకటించినప్పటికీ జాబితాలో పేర్లు లేవు.. అధికారులను అడిగితే చూద్దాం అంటూ దాటవేస్తున్నారు. సోమవారం మార్కాపురం, ఒంగోలు కార్పొరేషన్‌ల్లో పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలంటూ వినతి పత్రాలు సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా పురపాలికల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు సుమారు 3,500 మంది, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పిల్లలు మరో 1200 మంది ఆందోళన చెందుతున్నారు.

తల్లికి వందనాన్ని అమలు చేయాలి..

మార్కాపురం టౌన్‌: మార్కాపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తల్లికి వందనం పథకం వర్తింపచేయాలంటూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తల్లికి వందనం పథకం అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ కార్యదర్శి, సీపీఐ కార్యదర్శి నాసరయ్య తదితరులు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ అమ్మఒడి పథకం అమలు చేశారని, కూటమి ప్రభుత్వంలో మున్సిపల్‌ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వర్కర్లకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనరుకు వినతిపత్రం సమర్పించినట్లు వారు తెలిపారు.

కనిగిరిరూరల్‌: ‘‘మేము అధికారంలోకి వస్తే చదువుకునే పిల్లలందరికీ నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు’’ అంటూ కూటమి నాయకులు చంద్రబాబు, లోకేష్‌ దగ్గర నుంచి అందరూ ప్రచారం చేశారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు ఆ ఊసే ఎత్తలేదు. అన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సూపర్‌ సిక్స్‌లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కూటమి ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో అనేక మంది పిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల వాసులకు నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం వర్తించదనే నిబంధన పెట్టారు. ఈమేరకు తల్లికి వందనం అర్హుల జాబితా ప్రకటించారు. అయితే పారిశుద్ధ్య కార్మికులకు వర్తించవని ప్రభుత్వం పేర్కొంది. అయితే సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాల్లో వీరి పిల్లల పేర్లు కనుమరుగయ్యాయి. దీంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదేమిటని సంబంధిత అధికారులను అడిగితే ఇంకా టైం ఉంది కదా చూద్దాంలే అంటూ మాట దాటవేస్తున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో కార్మిక లోకం..

జిల్లాలోని ఒంగోలు, కనిగిరి, చీమకుర్తి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, పొదిలి నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో సుమారు 1,619 మంది పారిశుధ్య నాన్‌ పీహెచ్‌ (పబ్లిక్‌ హెల్త్‌) వర్కర్లు ఉన్నారు. సరాసరి ప్రతి కుటుంబంలో సుమారు ఇద్దరు పిల్లలు విద్యను అభ్యసిస్తున్నట్లు అంచనా. దాదాపు 3,500 మందికి పైగా కార్మికుల పిల్లలు తల్లికి వందనం దక్కని పరిస్థితి. వీరు కాకుండా కాంట్రాక్ట్‌ బేసిక్‌లో 104, 108 వాహనాల్లో, ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు సుమారు 500 మంది వరకు ఉన్నారు. వారి పిల్లలు సుమారు 1,000 మంది ఉండవచ్చని అంచనా..

అసలే పెరిగిన ధరలతో అల్లాడుతుంటే..

కూటమి ప్రభుత్వంలో నిత్యవసర ధరలు అమాంతంగా పెరిగాయి. కుటుంబ పోషణ కష్టంగా మారి అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం సరికొత్త నిబంధనలతో తల్లికి వందనానికి దూరం చేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, కార్పొరేషన్లలో రూ.15 వేల నుంచి రూ.21 వేల జీతంతో అనేక మంది పారిశుధ్య కార్మికులు, నాన్‌ పబ్లిక్‌ హెల్త్‌ కార్మికులు చాలీచాలని జీతాలతో జీవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పడంతో నమ్మి అనేక మంది ఓట్లు వేశారు. తీరా నిబంధనల పేరుతో తమ నోట్లో మట్టి కొట్టడం ఏంటని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తల్లికి వందనం జాబితాల్లో పేర్ల గల్లంతుతో ఆందోళన పారిశుద్ధ్య కార్మిక పిల్లలకు నిబంధనల సడలింపు అంటూ ప్రకటన కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న కార్మికులు జిల్లాలో సుమారు 1619 కుటుంబాల్లో 3500 మంది పేర్లు మాయం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు మరో 500 కుటుంబాల్లో 1200 మందికి దూరం మా పిల్లలకు చదువులు వద్దా అంటూ ఆగ్రహం కార్మిక సంఘాల ఆందోళన మార్కాపురంలో ఏఐటీయూసీ ధర్నా ఒంగోలులో సీఐటీయూ వినతి పత్రం అందజేత

చాలీచాలని జీతాలతో అవస్థలు..

ఒంగోలు టౌన్‌: మున్సిపాలిటీ విభాగాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులకు అతితక్కువ వేతనాలు చెల్లిస్తుండడంతో చాలీచాలని జీతాలతో జీవితాలు గడుపుతున్నారని సీఐటీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కార్మికులను ఆప్కాస్‌ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులుగా ఆన్‌లైన్లో పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. ఈ సాకుతో పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు తల్లికి వందన ఎగనామం పెట్టారన్నారు. దీంతో పాటు పెన్షన్‌, ఇతర సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. ఈ మేరకు సోమవారం నగర కమిషనర్‌ కార్యాలయంలో ఎంహెచ్‌ఓ డాక్టర్‌ వైష్ణవికి సీఐటీయూ నగర కార్యదర్శి టి.మహేష్‌ వినతి పత్రం అందజేశారు.

పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు విద్య అవసరం లేదా?

పారిశుద్ధ్య కార్మికులు, పీహెచ్‌ వర్కర్లకు తల్లికి వందనం పథకం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. అసలే నిత్యవసర ధరలు పెరిగి జీవనం గడవటం కష్టంగా మారినా.. చాలీచాలని జీతాలతో అల్లాడుతున్న పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు తల్లికి వందనం లేకుండా చేస్తే ఎలా? ప్రస్తుతం వారికిచ్చే రూ.15 వేల జీతాలతో కుటుంబ పోషణ గడవటమే కష్టం. నిబంధనల్లో మాత్రం సడలింపు అన్నారు. అయితే లబ్ధిదారుల జాబితాలో వీరి పేర్లు లేవు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి.

– సయ్యద్‌ యాసీన్‌, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు

తల్లిడిల్లి1
1/3

తల్లిడిల్లి

తల్లిడిల్లి2
2/3

తల్లిడిల్లి

తల్లిడిల్లి3
3/3

తల్లిడిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement