
ఆగిసాగిన పొగాకు వేలం
కనిగిరిరూరల్: పొగాకు రైతుల గోడును కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు. దీంతో పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. మద్దతు ధరలు కల్పించాలని, వేలం కేంద్రానికి తెచ్చిన అన్ని రకాల పొగాకు బేళ్లను కొనుగోలు చేయాలని, లో గ్రేడ్ బేళ్లను తిరస్కరించకుండా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కనిగిరిలో పొగాకు వేలాన్ని రైతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. మాచవరం క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల రైతులు 618 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. బయ్యర్లు మంచి రకం (ఎఫ్–1, ఎఫ్–2, ఎఫ్–3) బేళ్లను మాత్రమే కొనుగోలు చేస్తూ నామమాత్రంగా ఒకటీరెండు లో గ్రేడ్ బేళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో రైతులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో వేలం కేంద్రం సూపరింటెండెంట్ కోటేశ్వరరావు రైతులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నం చేశారు. 9 కంపెనీలు వేలంలో పాల్గొంటున్నప్పటికీ అందరూ ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ సూపరింటెండెంట్ను రైతులు ప్రశ్నించారు. మంచి గ్రేడ్ బేళ్లు కొని మిగిలిన వాటిని తిరస్కరిస్తే తమ పరిస్థితి ఏంటని నిలదీశారు. కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని, కంపెనీలన్నీ కుమ్మకై ్క రైతులకు ఆన్యాయం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. లో గేడ్ర్ బేళ్లు కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో రైతులు తిరిగి వేలంలో పాల్గొన్నారు. మాచవరం క్లస్టర్ పరిధిలోని గ్రామాల నుంచి 618 బేళ్లు వేలానికి రాగా, వాటిలో 378 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 240 బేళ్లను తిరస్కరించారు. కేజీ గరిష్ట ధర రూ.280 పలకగా, కనిష్ట ధర రూ.180 పలికింది. సరాసరి ధర కేజీ రూ.249 పలికినట్లు అధికారులు తెలిపారు.
టంగుటూరులో చెయిన్ స్నాచింగ్
టంగుటూరు: వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో బంగారు చెయిన్ను గుర్తుతెలియని వ్యక్తి లాక్కుని వెళ్లిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. టంగుటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరు గ్రామానికి చెందిన చెరుకూరి ప్రభావతి టంగుటూరు – అనంతవరం రోడ్డులో ఆదివారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి నడుచుకుంటూ వచ్చి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు చెయిన్ లాక్కుని పంట పొలాల్లోకి ఉడాయించాడు. దీంతో లబోదిబోమంటూ టంగుటూరు పోలీసుస్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమళ్లీశ్వరరావు తెలిపారు.
కనిగిరిలో కొంతసేపు బహిష్కరించిన రైతులు
అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన
వేలం కేంద్రం సూపరింటెండెంట్ సర్దిచెప్పడంతో తిరిగి కొనసాగిన వేలం