ఒంగోలు వన్టౌన్: కుట్టుమిషన్పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీ నుంచి 31 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంతాల మహిళలు అర్హులని చెప్పారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 8309915577 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
మద్యం బాటిళ్లు స్వాధీనం
నాగులుప్పలపాడు: బెల్టు షాపుపై దాడి చేసి 8 మద్యం బాటిళ్లను నాగులుప్పలపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై రజియా సుల్తానా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తూ మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో నాగులుప్పలపాడు పోలీసులు దాడి చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 8 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పేకాట శిబిరంపైనా దాడి...
నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో పేకాటాడుతున్నారన్న సమాచారంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పై రజియా సుల్తానా తెలిపారు. వారి నుంచి రూ.1100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
లక్ష్మీనరసింహస్వామికి ముగిసిన బ్రహ్మోత్సవాలు
సింగరాయకొండ:
సా్థనిక పాతసింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి పుష్పయాగం కార్యక్రమంతో ముగిసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ఉదయగిరి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. పుష్పయాగం సందర్భంగా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు.
21 నుంచి కుట్టుమిషన్పై ఉచిత శిక్షణ