
అతిసార వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు సబర్బన్: శిశువులు, పిల్లల్లో అతిసార వ్యాధిపై తల్లులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. ఒంగోలులోని కలెక్టరేట్లో మీ కోసం కాన్ఫరెన్స్ హాల్లో డయేరియాను నిలువరించాలనే కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకరోజులో మూడు, అంతకన్నా ఎక్కువసార్లు పలుచగా విరేచనాలైతే అతిసార వ్యాధిగా భావించి చికిత్స చేయించాలని సూచించారు. భోజనానికి ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం, పరిశుభ్రంగా ఉండటం ద్వారా అతిసార వ్యాధిని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్ఓ ఓబులేసు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, తదితరులు పాల్గొన్నారు.
పిల్లలు పరిశుభ్రంగా ఉండేలా తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలి
కలెక్టర్ తమీమ్ అన్సారియా