
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నేడు జరగనుంది. గురువారం మధ్యాహ్నా ప్రాంతంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై, కీలకాంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.