లక్ష మందితో సభ అన్నారు ఏమైంది..?

Telangana BJP President Bandi Sanjay Comments On CM KCR - Sakshi

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ సభలో పస లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు కేసీఆర్‌ తప్పతాగి ఫాంహౌస్‌లో పడుకున్నారని.. అందుకే ఢిల్లీ నుంచి తమ నాయకులు వస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు పంచి కేసీఆర్ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. లక్ష మందితో సభ అన్నారు ఏమైందని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అని ఎద్దేవా చేశారు. ‘‘మూసి ప్రక్షాళన కాదు కేసీఆర్‌ నోరు ప్రక్షాళన చేయాలి. మాది గల్లీ నుంచి ఢిల్లీకి విస్తరించిన పార్టీ’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. (చదవండి: ‘ఇంట్లో చెప్పే వచ్చా.. చావుకు భయపడేది లేదు’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top