
ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది.
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ అధికారికంగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో అనుచిత వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడదల చేసింది. ఈ జాబితాలోనే గోషామహల్ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రకటించింది.
చదవండి: దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. సీపీఐకి ఎదురుదెబ్బ!