‘నిజం గెలుస్తుంది’ కాబట్టే జైలుకి దోషులు: మంత్రి అంబటి | Minister Ambati Rambabu Comments On Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

‘నిజం గెలుస్తుంది’ కాబట్టే జైలుకి దోషులు: మంత్రి అంబటి

Oct 22 2023 3:11 PM | Updated on Oct 22 2023 3:25 PM

Minister Ambati Rambabu Comments On Chandrababu And Lokesh - Sakshi

స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్‌ చేశారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

సాక్షి, గుంటూరు: స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్‌ చేశారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోర్టు కూడా ఆధారాలను నమ్మింది కాబట్టే రిమాండ్‌కు పంపిందన్నారు. సీఐడీ న్యాయవాదులపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

‘‘నిజం గెలవాలి అంటూ భూవనేశ్వరి పొలిటికల్‌ డ్రామా మొదలుపెడుతున్నారు. లోకేష్‌ తలాతోకా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. సింపతీ కోసమే భువనేశ్వరి యాత్రకు సిద్ధమవుతున్నారు. లోకేష్‌ను నమ్ముకుంటే టీడీపీ నేతలు బంగాళాఖాతంలోకి వెళతారు. లోకేష్‌ టీడీపీని బతికించడానికి పనికిరాడు. రాజకీయాలను వ్యాపారం చేసిన వ్యక్తి చంద్రబాబు. తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించాల్సిందే. దేశంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబుకు ఎవ్వరూ మద్దతుగా లేరు. పవన్‌ తప్ప చంద్రబాబును చూసేందుకు ఎవరైనా వచ్చారా?. టీడీపీతో ఉన్న ఒప్పందంతో పవన్‌ వచ్చాడు’’ అని విమర్శలు గుప్పించారు.

‘‘నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు జైలుకు వెళుతున్నారు. లోకేశ్ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరు. పవన్‌కు ఏ విషయంపైనా అవగాహన లేదు. విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తప్పా?. వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనుడు చంద్రబాబు’’ అంటూ మంత్రి అంబటి మండిపడ్డారు.
చదవండి: బస్సు యాత్రతో ప్రజలకు మరింత చేరువ: మంత్రి బొత్స 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement