మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం | Medical Health Department Withdraws Covid Advisory Under Pressure From Tdp | Sakshi
Sakshi News home page

మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం

May 25 2025 6:26 PM | Updated on May 25 2025 6:49 PM

Medical Health Department Withdraws Covid Advisory Under Pressure From Tdp

సాక్షి, విజయవాడ: మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు సర్కార్‌ చెలగాటమాడుతోంది. టీడీపీ నేతల ఒత్తిడితో కోవిడ్ అడ్వైజరీని వైద్య ఆరోగ్య శాఖ ఉపసంహరించింది. కేసులు నమోదు కానప్పుడు ఈ నెల 21న  జాగ్రత్తలు కోసం వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 3 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాక  కోవిడ్ అడ్వైజరీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కేవలం మహానాడు కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టేలా నిర్ణయం తీసుకుంది.

బహిరంగ సభలు, భారీ ర్యాలీలు, జన సమీకరణ చేపట్టొద్దని వైద్య ఆరోగ్య శాఖ 21న ఆదేశాలు జారీ చేసింది.  27, 28, 29న జన సమీకరణతో మహానాడు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. మహానాడు కోసం ప్రజల సంరక్షణను పణంగా పెడుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ ఆదేశాలు చూసి వైద్యులు నివ్వెరపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement