నా తదుపరి పోరు దాని మీదనే: దీదీ | Mamata Banerjee Press Meet After Nandigram Victory | Sakshi
Sakshi News home page

నా తదుపరి పోరు దాని మీదనే: దీదీ

May 2 2021 5:27 PM | Updated on May 2 2021 5:31 PM

Mamata Banerjee Press Meet After Nandigram Victory - Sakshi

కోల్‌కతా: రసవత్తరంగా సాగిన నందిగ్రామ్‌ కౌంటింగ్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారిపై 1200 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు దీదీ. నందిగ్రామ్‌ ఫలితం అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ఇది బెంగాల్‌ ప్రజల విజయం అన్నారు. తనను గెలిపించిన బెంగాల్‌ ప్రజలకు దీదీ కృతజ్ఞతలు తెలిపారు. విజయం ముఖ్యం కాదు.. కరోనాను ఎదుర్కొవడమే ప్రధానం అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలని సూచించారు. తన తదుపరి పోరాటం కోవిడ్‌ మీదనే అన్నారు దీదీ.

ఇక నందిగ్రామ్‌ బరిలో మమత కేవలం 1,200 స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం టీఎంసీ 215 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. 

చదవండి: మమతా మ్యాజిక్‌:  బీజేపీ ప్రధాన కార్యదర్శి స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement