కాళేశ్వరం కొట్టుకుని పోతే నీళ్లెలా వచ్చాయి? | Harish Rao questions Congress claims of Kaleshwaram being failure | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం కొట్టుకుని పోతే నీళ్లెలా వచ్చాయి?

Aug 12 2024 4:13 AM | Updated on Aug 12 2024 4:13 AM

Harish Rao questions Congress claims of Kaleshwaram being failure

కాంగ్రెస్‌. బీజేపీ ఒక్కటే..

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేటజోన్‌: కాళేశ్వరం కొట్టుకు పోయిందని రాద్దాంతం చేశారని, ఇప్పుడు నీళ్లు ఎలా వచ్చాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటేనని, ఈ రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 229 మందికి సీఎం సహా యనిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్‌ బద్నాం చేసిందని, మరి ఇప్పుడు రంగనాయక సాగ ర్‌లోకి కాళేశ్వరం గోదారి నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నేడు రంగనాయక సాగర్‌ నిండుకుండలా ఉందన్నారు. రెండు పంటలకు సరిపడేలా నీళ్లు ఉన్నా యని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బెల్ట్‌ షాపులు మూసివే స్తామని చెప్పి నేడు గల్లీ గల్లీలో పెట్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని, గుండు సున్నా ఇచ్చిందని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement