సాక్షి హైదరాబాద్: సినీ నటుడు చిరంజీవిని రాష్ట్ర మంత్రి కొండాసురేఖ తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి అంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి అందజేశారు. ఇటీవల చిరంజీవికి మనవడు పుట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఇటీవల చిరంజీవి కుమారుడు రాంచరణ్కు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని వారి నివాసంలో మా కుమార్తె కొండా సుస్మితతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.@KChiruTweets pic.twitter.com/JUMYDVAaaA
— Konda Surekha (@iamkondasurekha) February 2, 2026


