CPI CPM Will Alliance With BRS Party In Telangana Assembly Elections - Sakshi
Sakshi News home page

పొత్తు తప్ప మరో గత్యంతరం లేదు!.. చెరో పది అసెంబ్లీ సీట్లలో పోటీ?

Jan 18 2023 8:23 AM | Updated on Jan 18 2023 9:54 AM

CPI CPM Will Alliance with BRS Party In Telangana Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో చెరో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం యోచిస్తున్నాయి. ఆ మేరకు బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. వీలును బట్టి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు స్పష్టం చేయాలని భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ వల్లే బీఆర్‌ఎస్‌ గెలిచిందని, కాబట్టి ఆ పార్టీ మళ్లీ అధికారం రావాలంటే తమతో పొత్తు తప్ప మరో గత్యంతరం లేదని సీపీఐ, సీపీఎం చెబుతున్నాయి.

అయితే 20 సీట్లు బీఆర్‌ఎస్‌ ఇస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు చివరకు చెరో ఐదు సీట్లయినా ఇవ్వాలని పట్టుబడతామని ఆ పార్టీల నేతలు అంటున్నారు. చెరో ఐదు స్థానాలైనా ఇవ్వకపోతే పొత్తుపై పునరాలోచించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే చెరో ఐదు స్థానాలైనా బీఆర్‌ఎస్‌ ఇస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement