అవినీతిలో నంబర్‌వన్‌

BJP Leader Amit Shah Fires On CM KCR And BRS - Sakshi

తెలంగాణ పథకాలు, మిషన్లు.. కేసీఆర్‌ కుటుంబానికి కమీషన్లు : అమిత్‌ షా

కాళేశ్వరం, మిషన్‌ భగీరథలో రూ. వేల కోట్లు పక్కదారిపట్టాయి 

రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌ సర్కారు అవినీతిపై విచారణ 

చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో పసుపు బోర్డు 

బైరాన్‌పల్లిలో అమరుల స్మృతి చిహ్నం 

జగిత్యాల జిల్లాలో బీడీ కార్మీకుల కోసం 500 పడకల ప్రత్యేక ఆస్పత్రి 

జనగామ, కోరుట్ల, ఉప్పల్‌ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ బహిరంగ సభలు

జనగామ/కోరుట్ల/మెట్‌పల్లి/మల్లాపూర్‌ (హైదరాబాద్‌): బీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలో మిషన్‌ పథకాలన్నీ కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల స్కీంలుగా మారిపోయాయని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. అవినీతి ర్యాంకింగ్‌లో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా పేరు తెచ్చుకుందని వ్యాఖ్యానించారు. కొట్లాడి సాధించుకున్న నయా తెలంగాణకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించడానికి మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితులు రావడం విచారకరమని పేర్కొన్నారు.

బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభల్లో, ఉప్పల్‌ నియోజకవర్గంలోని నాచారంలో నిర్వహించిన రోడ్‌ షోలో అమిత్‌ షా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ గొప్పగా చెప్పుకునే మిషన్‌ స్కీములన్నీ కమీషన్ల మార్కెట్‌గా మారిపోయాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, ఔటర్‌ రింగ్‌రోడ్డు, గ్రానైట్‌ గనులు, మియాపూర్‌ భూములు, కాళేశ్వరం ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరిగింది. కాళేశ్వరంలో రూ.45 వేల కోట్లు, మిషన్‌ కాకతీయలో రూ.24 వేల కోట్లు పక్కదారి పట్టాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను, కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం. 

కుటుంబ పార్టీలను సాగనంపాలి 
దేశంలో కుటుంబ పాలన కొనసాగిస్తున్న 2జీ బీఆర్‌ఎస్, 3జీ ఎంఐఎం, 4జీ కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు సాగనంపాలి. తరతరాలుగా వారసత్వ పాలన కోసం తండ్లాడే పార్టీలు అవి. అదే బీజేపీ ఎప్పుడూ ప్రజల పార్టీగా నిలబడుతుంది. తెలంగాణలో ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను తొలగించి.. జనాభా ప్రాతిపాదికన బీసీ, ఎస్సీలకు ఇస్తాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుంది. దానికి బీజేపీ కట్టుబడి ఉంది. 

మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితి 
ఉక్కు మనిషి సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో విముక్తి పొందిన తెలంగాణ.. ఆంధ్రా పాలకుల చేతిలో నలిగిపోయింది. కొట్లాడి సాధించుకున్న నయా తెలంగాణకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించడానికి మళ్లీ ఉద్యమించాల్సిన పరిస్థితులు రావడం విచారకరం. కేసీఆర్‌ ఎంఐఎం ఓవైసీలకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని విస్మరిస్తున్నారు. మేం అధికారంలోకి రాగానే సెప్టెంబర్‌ 17న విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. సాయుధ పోరాటం చేపట్టి నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల కర్కశత్వానికి బలైన బైరాన్‌పల్లి ఉద్యమకారులకు జోహార్లు అర్పిస్తూ ఆ గ్రామంలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తాం.
 
అంతర్జాతీయ స్థాయిలో పసుపు బోర్డు 
దేశంలో పసుపు రైతులకు సముచిత న్యాయం చేసేందుకు త్వరలో అంతర్జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం. వరి ధాన్యానికి రూ.3,100 మద్దతుధర ఇస్తాం. ఉచితంగా పంటల బీమా అమలు చేస్తాం. ఉజ్వల పథకం కింద ఏటా ఉచితంగా నాలుగు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం. పేద కుటుంబాలకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. చిన్న, సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాల కోసం రూ.2,500 ఇస్తాం. 

ఆ భూకబ్జాదారులకు ఓటేయద్దు 
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇద్దరూ భూకబ్జాదారులు. అలాంటి వారికి ఓటెయ్యకుండా.. దేశాభివృద్ధికి పాటుపడే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి’’ అని అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. 
 
జైశ్రీరామ్‌ నినాదాలతో దద్దరిల్లిన రోడ్‌ షో 
ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన అమిత్‌ షా రోడ్‌షో ఆసాంతం మోదీ.. వందేమాతరం.. జై శ్రీరామ్‌.. నినాదాలతో హోరెత్తింది. దారిపొడవునా భవనాల పైనుంచి ప్రజలు అమిత్‌ షా, ఇతర బీజేపీ నేతలపై పూలు చల్లారు. అయితే రోడ్‌షోతో మల్లాపూర్, నాచారం, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి వాహనాదారులు ఇబ్బంది పడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-11-2023
Nov 20, 2023, 16:13 IST
సాక్షి,నర్సాపూర్‌ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ...
20-11-2023
Nov 20, 2023, 15:48 IST
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌ : కాంగ్రెస్‌ ధరణిని రద్దు చేసి దాని ప్లేస్‌లో భూమాత అనే స్కీమ్‌ తీసుకొస్తారట కాంగ్రెస్‌ వాళ్లు తెచ్చేది భూమాత...
20-11-2023
Nov 20, 2023, 13:53 IST
ఖమ్మంలో రెండు సామాజిక వర్గాలు ఏటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..
20-11-2023
Nov 20, 2023, 13:34 IST
సాక్షి, కామారెడ్డి: దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పాతముఖాలే కనిపించేవి. గెలిచినా, ఓడినా వాళ్లే బరిలో ఉండేవారు....
20-11-2023
Nov 20, 2023, 13:19 IST
సిరిసిల్ల: అది సిరిసిల్ల జిల్లా కేంద్రం. సమయం అర్ధరాత్రి దాటింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణ వాసులు నిద్రపోతున్నారు. నేతకార్మికులు...
20-11-2023
Nov 20, 2023, 12:54 IST
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్‌ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్‌ వంటి రాజకీయ...
20-11-2023
Nov 20, 2023, 12:18 IST
నిర్మల్‌/ఖానాపూర్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘కుమురంభీమ్, రాంజీగోండు, సమ్మక్క–సారలమ్మ లాంటి వీరుల భూమి ఇది. జల్‌ జంగల్‌ జమీన్‌ కోసం పోరాడిన గడ్డ...
20-11-2023
Nov 20, 2023, 11:26 IST
రూపురేఖలు మార్చే ఎన్నికలివి.. ‘మిత్రులారా.. మొట్టమొదటగా ఈ ప్రాంత మాతా మాణికేశ్వరి అమ్మవారికి నమస్కరిస్తున్నా.. అభ్యర్థుల పేర్లు ఏదైతే చెప్పినప్పుడు హర్షధ్వానాలతో...
20-11-2023
Nov 20, 2023, 10:43 IST
నాగర్‌కర్నూల్‌/అలంపూర్‌/కొల్లాపూర్‌/కల్వకుర్తి రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకమవుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
20-11-2023
Nov 20, 2023, 09:45 IST
జహీరాబాద్‌: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఎం.బాగారెడ్డి,...
20-11-2023
Nov 20, 2023, 09:14 IST
రాజకీయ పార్టీల్లో వలసల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఒక...
20-11-2023
Nov 20, 2023, 08:54 IST
హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం...
20-11-2023
Nov 20, 2023, 08:53 IST
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర...
20-11-2023
Nov 20, 2023, 05:31 IST
ధర్మపురి/పెగడపల్లి/కాటారం: కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు....
20-11-2023
Nov 20, 2023, 05:21 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్‌ ఉండాలి..కేసీఆర్‌ ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌...
20-11-2023
Nov 20, 2023, 05:06 IST
సిద్దిపేటజోన్‌: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి...
20-11-2023
Nov 20, 2023, 04:51 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌ కర్నూల్‌: కాంగ్రెస్‌ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ పాలన అంటే ఆకలి చావులు, ప్రజలను...
20-11-2023
Nov 20, 2023, 04:30 IST
దుబ్బాకటౌన్‌: సీఎం కేసీఆర్‌కు వైన్స్‌ టెండర్లపై ఉన్న ప్రేమ కొలువుల నోటిఫికేషన్లపై ఎందుకు లేదని.. ఇంతటి దుర్మార్గమైన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని...
20-11-2023
Nov 20, 2023, 04:23 IST
నిర్మల్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘‘రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం అందరికీ...
20-11-2023
Nov 20, 2023, 01:38 IST
కరీంనగర్‌/పెగడపల్లి: ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తమ అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి...



 

Read also in:
Back to Top