రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా మానేరు గోదాం నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన దీనిని ఆరేళ్లుగా ఉపయోగించడంలేదు. ఏటా ఎరువులు పంపిస్తామని చెబుతున్నారే కానీ ఇప్పటివరకు సబ్సిడీ ఎరువులు రాలేదు. బయటి దుకాణాల్లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది.
– మానెం రాజేందర్, రైతు, మల్లారం
ఎరువులు పంపిస్తాం
ఈ వానాకాలం సీజన్లో వెంకటాపూర్ మానేరు గో దాంలో ఎరువులు, విత్తనా లు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందిస్తాం. – మామిడాల అశోక్,
సీఈవో, పీఏసీఎస్, మంథని


