ఆధ్యాత్మిక వారసత్వంగా సమ్మక్క గద్దెలు
గోదావరిఖని: ఆధ్యాత్మిక వారసత్వంగా నిలిచేలా సమ్మక్క–సారలమ్మ గద్దెలు పునర్నిర్మిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నా రు. నగర శివారులోని గోదావరి సమీప మినీ సమ్మక్క–సారలమ్మ జాతర పూజలను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించి మాట్లాడారు. నాయకులు మ హంకాళి స్వామి, శ్రీనివాస్రెడ్డి, ఆలయ ఈవో కాంతారెడ్డి, సింగరేణి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే సమాజం అ భివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజ్ఠాగూర్ అ న్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా బిగ్బాస్ స్వశక్తి సహకార సంఘాలతో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్


