
ఎన్టీపీసీ అధికారుల వైఫల్యంతోనే పగిలిన బూడిద పైపు
● ఎంపీ వంశీకృష్ణ
రామగుండం: ఎన్టీపీసీ అధికారుల నిర్లక్ష్యంతోనే అక్బర్నగర్ సమీపంలో బూడిద పైపులైన్ పగి లిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గురువారం అక్బన్నగర్లో సందర్శించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. పునరావాస గ్రామాలపై ఎన్టీపీసీ యాజమాన్యం తాత్కాలిక అభివృద్ధి పనులకు సీఎస్ఆర్ నిధులు వెచ్చిస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. రక్షణచర్యల్లో భాగంగా పైపులైన్ల నాణ్యత, గడువు కాలంపై ఉన్నతాధికారులు విచారణ చేయాల్సిన అవస రం ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్లాల్ కట్టర్ దృష్టికి తీసుకెళ్లి విచారణను కోరనున్నామన్నారు. ఇప్పటికై నా ఎన్టీపీసీ అధికారులు బాధితులకు సంపూర్ణ నష్టపరిహారం, మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీతో డీఆర్యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీని వాస్, ఎన్టీపీసీ అధికారులు తదితరులున్నారు.