జీఎంఆర్కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీ చైర్మన
విజయనగరం: తెలుగు ప్రజలు గర్వపడే ప్రముఖ పారిశ్రామికవేత్త, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావుకు ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు బుధవారం రాజాంలోని జీఎంఆర్ ఐటీ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్రతో కలిసి వెళ్లిన చిన్న శ్రీను జీఎంఆర్కి దుశ్శాలువ కప్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.


