
అన్నన్నా... ఇది కన్నారా?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి వారం చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నామమాత్రంగా సాగుతోంది. పట్టణంలోని రఘురామ్నగర్లో గల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం దీనిని నిర్వహించారు. ఇలాంటి వేదికపై ప్రజలు తమ సమస్యలపై వినతులు అందించడం సర్వసాధారణం. కానీ ఓ వ్యక్తి శుక్రవారం ఎమ్మెల్యేకు ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాన్ని అందజేశారు. దీని ద్వారా ఏ సమస్య పరిష్కారం అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి. – సత్తెనపల్లి