
రేపల్లె రూరల్: సాక్షి దినపత్రిక రేపల్లె నియోజకవర్గ విలేకరి గడ్డం శ్రీనివాసరావు అలియాస్ వాసు(53) శుక్రవారం ఆయన స్వగృహంలో ఆకస్మిక మృతి చెందారు. సాక్షి దినపత్రిక స్థాపితం నాటి నుంచి నేటి వరకు ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
గతంలోనూ పలు పత్రికలలో పనిచేశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నాలుగు నెలల కిందట ఆయన భార్య శివమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వాసుకు ఇరువురు కుమార్తెలు. ఆయన మృతికి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్, వైఎస్సార్ సీపీ నాయకులు, రేపల్లె ప్రెస్క్లబ్ సభ్యులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.