ఇద్దరు మహిళల బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళల బలవన్మరణం

Oct 23 2024 1:02 AM | Updated on Oct 23 2024 11:20 AM

-

వీరిలో ఒకరికి ఆరు నెలల క్రితమే వివాహం 

మల్కన్‌గిరి: ఇద్దరు వివాహితలు బలవన్మరణానికి పాల్పడ్డారు. పొడియా సమితి పరిధిలో ఒకరు, కలిమెల పొలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎం.వి.70 గ్రామంలో మరొకరు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. వీరిలో ఒకరికి ఆరు నెలల క్రితమే వివాహమైంది. వివరాల్లోకి వెళితే.. మల్కన్‌గిరి జిల్లా పోడియా సమితి కేంద్రానికి చెందిన నెందే బాట (22)కు సింగ బాట అనే యువకుడితో ఆరు నెలల క్రితం వివాహమైంది. ఆయితే ఏమైందో తెలియదుగాని సోమవారం రాత్రి అందరితో కలిసి భోజనాలు చేసిన తరువాత పడుకున్నారు. 

అర్ధరాత్రి తరువాత నెందే బాట ఎవరూ లేని వేరే గదిలోకి వెళ్లి దూలానికి తాడుతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. మంగళవారం ఉదయం లేచి ఏవరి పనిలో వారు ఉండగా భర్త సింగ బాటకు భార్య కనిపించకపోవడంతో ఇంట్లో వేతికాదు. చివరికి ఓ గది తలుపు వేసి ఉండటంతో అనుమానంతో బలవంతంగా వాటిని తెరిసి చూసేసరికి దూలానికి వేలాడుతూ నెందే బాట వేలాడుతూ చనిపోయి కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. భార్య చనిపోయినట్టు పోడియా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాధు చేశాడు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసునమోదు చేసి మృతదేహాన్ని కలిమెల ఆరోగ్య కేంద్రానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

కలిమెల పోలీసుస్టేషన్‌ పరిధిలో..
కలిమెల పొలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎం.వి.70 గ్రామంలో కరుణ దాస్‌ (22) అనే వివాహిత ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. సమాచారం తెలుసుకున్న పొలీసులు సంఘటన స్థలంకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అశోక్‌ దాస్‌తో కరుణ దాస్‌కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందనే విషయం తెలియరాలేదు. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement