ప్రభుత్వం తీర్మానం చేయాలి
ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేకుండా చట్ట సవరణ చేసేందుకు అవసరమైన తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదం తెలిపాలి. తద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.
– ఎంవీ మహాంకాళీశ్వరరావు,
కృష్ణాజిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ టీఏ
విద్యాహక్కు చట్టం సవరణ చేసి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష లేకుండా చేయాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అదే బాటలో ఏపీ ప్రభుత్వం సైతం ముందుకు రావాలి.
– ఎ. సుందరయ్య,
ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, యుటీఎఫ్


