
బహిష్కరిస్తే జైలుపాలు
● భూ పంచాయితీలో తలదూర్చి తనను కులం నుంచి బహిష్కరించారని జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్ వీడీసీపై గ్రామానికి చెందిన ఎర్రోళ్ల హన్మాండ్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం 16 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. విచారణ అనంతరం వీడీసీ సభ్యులకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఈనెల 3వ తేదీన జిల్లా ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస్ తీర్పు ఇచ్చారు. వీడీసీ సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఉన్నారు.
● నాయక్పోడ్ కులస్తులపై సామాజిక బహిష్కరణ విధించిన జక్రాన్పల్లి మండలం మునిపల్లి వీడీసీ సభ్యులు 13 మంది సారంగాపూర్ సెంట్రల్ జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. గ్రామంలోని శివాలయానికి వెళ్లే రోడ్డు కబ్జాకు గురైందని, తమకు దారి చూపాలని నాయక్పోడ్ కులస్తులు కోరగా.. 2012 నవంబర్లో అప్పటి సర్పంచ్ సాయిరెడ్డి, ఎంపీటీసీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో వారిపై వీడీసీ సామాజిక బహిష్కరణ విధించింది. దీంతో నాయక్పోడ్ కులస్తులు జక్రాన్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో 13 మందికి ఐదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ ఈనెల 17వ తేదీన నిజామాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస్ తీర్పు ఇచ్చారు.
వీడీసీలది నియంతృత్వం
వీడీసీల నియంతృత్వం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వీడీసీల్లో ఓ వర్గం పెత్తనం పెరిగిపోయింది. అణగారిన వర్గా లు, చేతివృత్తుల వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి వీడీసీలు కృషి చేయాల్సి ఉంటుంది. కానీ కుల, గ్రామ, సామాజిక బహిష్కరణలు చేస్తున్నాయి. తాళ్లరాంపూర్ గీత కార్మికులపై ఆంక్షలు ఎత్తివేయాలి. దీనిపై కోర్టు ఇచ్చిన తీర్పు వీడీసీలకు గుణపాఠంగా మారుతుంది. – వి. ప్రభాకర్,
సీపీఐఎంఎల్ మాస్లైన్, రాష్ట్రకార్యవర్గసభ్యులు
కోర్టు తీర్పు చెంపపెట్టు
వీడీసీలు రాజ్యాంగాన్ని అతిక్రమించి సమాంతరం ప్రభుత్వాలను నడుపుతున్నాయి. దీంతో వీడీసీల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారు. వీడీసీల ను రద్దు చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కొన్ని చోట్ల గ్రామపంచాయితీలు ఇవ్వాల్సిన అన్ని రకాల పర్మిషన్లను వీడీసీ ద్వారా కొనసాగుతున్నా యి. మునిపల్లి, కొలిప్యాక్ వీడీసీలపై కోర్టు తీర్పు లు వీడీసీలకు చెంపపెట్టు. – సుధాకర్,
సీపీఐ జిల్లా కార్యదర్శి, నిజామాబాద్
● రెండు గ్రామ కమిటీలకు ఇటీవల
జైలుశిక్ష విధించిన కోర్టు
● చంచల్గూడ జైలులో కొలిప్యాక్ వీడీసీ
● సారంగాపూర్ జైలులో మునిపల్లి
గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు
● వీడీసీలపై కఠినంగా
వ్యవహరిస్తున్న పోలీసుశాఖ
● అయినా కొన్ని గ్రామాల్లో
కనిపించని మార్పు
● పంచాయితీల్లో తలదూరుస్తూ
గ్రామ బహిష్కరణలు
ఖలీల్వాడి: గ్రామాభివృద్ధి పేరుతో ఏర్పడిన కమిటీలు భూ తగదాలు, కులవృత్తులు, ఇళ్ల నిర్మాణాలు తదితర పంచాయితీల్లో తలదూర్చి అమాయకులపై హుంకరిస్తే ఊచలు లెక్కించాల్సిందేననే సంకేతాలను పోలీసులు ఇస్తున్నారు. పలు గ్రామాల్లో వీడీసీ(గ్రామాభివృద్ధి కమిటీ)ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది.
అయితే చాలా మంది బాధితులు వారి నియంతృత్వ ధోరణిని ఎదిరిస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు భయపడకుండా తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తుండడంతో పోలీసులు సైతం కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వీడీసీలపై పీఎస్లలో కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్, మునిపల్లి వీడీసీలు జైలుకు వెళ్లాయి. రెండు కేసుల్లో 15 రోజుల వ్యవధిలోనే కోర్టు తీర్పులు వెలువడ్డాయి.
వారు చెప్పింది శాసనం కాదు..
గ్రామాల్లో సమాంతర ప్రభుత్వం నడిపేందుకు ప్రయత్నిస్తున్న వీడీసీలు ‘మేము చెప్పిందే శాసనం..’ అనేలా వ్యవహరిస్తున్నా.. బాధితులు ఏ మా త్రం భయపడకుండా ప్రశ్నిస్తున్నారు. గ్రామ, కుల, సామాజిక బహిష్కరణలపై పోలీసు స్టేషన్లకు వెళ్తున్నారు. వీడీసీలకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్న పోలీసులు.. విననిపక్షంలో కేసులు నమోదు చేస్తున్నారు. సీపీ సాయిచైతన్య సైతం వీడీసీల ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ మార్పు కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వీడీసీలు.. తమ నియంతృత్వ ధోరణిని మాత్రం వదులుకోవడం లేదని, దీంతో బాధితులు చాలా మంది మానసికంగా కృంగిపోతున్నారని అంటున్నారు. కల్లు గీత కార్మికులు చెట్లు గీయాలన్నా, గొల్లకుర్మలు జీవాలను మేపాలన్నా ఇలా ఆయా కులవృత్తుల వారి నుంచి వీడీసీలు ప్రతి ఏడాది డబ్బులు వసూలు చేస్తున్నాయి.

బహిష్కరిస్తే జైలుపాలు

బహిష్కరిస్తే జైలుపాలు