
పురాతన కాలం నుంచే యోగాకు ప్రాముఖ్యం
నిజామాబాద్నాగారం: పురాతన కాలం నుంచే యోగాకు చాలా ప్రాముఖ్యత ఉందని జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్బీ అన్నారు. నగరంలోని మారుతినగర్లోగల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాచీన వైద్యం, యోగాతో మానసిక ప్రశాంతత, అవయవాల కదలిక, నాడీ వ్యవస్థ ప్రతి ఒక్కటి చక్కగా ఉంటుందని తెలిపారు. మానసిక దివ్యాంగులు అయినప్పటికీ విద్యార్థులందరూ సుమారు 30 ఆసనాలు వేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సొసైటీ నిర్వాహకులు ఎస్ సిద్దయ్య, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ ఎస్.జ్యోతి ,మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి మరియు స్నేహ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.