
యోగా శిక్షణతో ఉపాధి
యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిసున్నాయి. ఇప్పటివరకు పతంజలి విశ్వవిద్యాలయం ద్వారా 1400 మంది అసిస్టెంట్ యోగా టీచర్గా శిక్షణ పొందారు. ఆయుష్ యోగా సర్టిఫికేషన్ బోర్డు ఢిల్లీ ద్వారా సుమారుగా 500 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభించాయి. ఇందులో ఆయుష్మాన్ భారత్ ద్వారా తెలంగాణలో 550 మంది యోగా ఇన్స్టక్ట్రర్లుగా, వివిధ పాఠశాలల్లో యోగా టీచర్లుగా పని చేస్తున్నారు. ప్రతిరోజు యోగా కోసం ప్రతిఒక్కరూ కొంత సమయం కేటాయించాలి.
– విశ్వనాథ్ మహజన్, యోగా మాస్టర్, రుద్రూర్