మా అన్న మృతదేహం తెప్పించండి | - | Sakshi
Sakshi News home page

మా అన్న మృతదేహం తెప్పించండి

Jun 21 2025 3:43 AM | Updated on Jun 21 2025 3:43 AM

మా అన్న మృతదేహం తెప్పించండి

మా అన్న మృతదేహం తెప్పించండి

మోర్తాడ్‌(బాల్కొండ): ఒమన్‌ దేశం నుంచి తన అన్న మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌కు చెందిన మృతుడి సోదరుడు హరీష్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్ర వాసీ ప్రజావాణిలో మృతుడి సోదరుడు హరీష్‌, కుటుంబసభ్యులు వినతిపత్రం అందజేశారు. కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూర్‌కు చెందిన జుంబారత్‌ అన్వేష్‌(27) ఉపాధి నిమిత్తం ఒమాన్‌ దేశానికి వెళ్లాడు. వారం రోజుల క్రితం ఒమాన్‌లోని బురైమి ప్రాంతంలోగల తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ ఇప్పటికీ మృతదేహం స్వగ్రామానికి చేరలేదు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు పూర్తిచేయడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో మృతదేహం తరలించడానికి జాప్యం ఏర్పడింది. దీంతో మృతుడి కుటుంబసభ్యులు ప్రవాసీ ప్రజావాణికి తరలివచ్చారు. మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, రాష్ట్ర ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ మంద భీంరెడ్డిలతో కలిసి సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. వారు స్పందించి ఒమాన్‌లోని మన దేశ అధికారులను సంప్రదించి, మృతదేహం త్వరగా తెప్పించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఒమన్‌ దేశంలో ఆత్మహత్యకు

పాల్పడిన హాసాకొత్తూర్‌ యువకుడు

రోజులు గడుస్తున్నా స్వగ్రామానికి

చేరని మృతదేహం

ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన

మృతుడి సోదరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement