
నాడు వ్యాధిగ్రస్తుడు.. నేడు యోగా టీచర్
డిచ్పల్లి: మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన ముల్క శ్రీనివాస్ మోటారు బైక్ మెకానిక్ పని చేస్తుంటాడు. అతడికి 2009లో స్పైన్, హైబీపీతో ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, చాలా మందులు వాడినా సమస్య పరిష్కారం కాలేదు. 2015లో యోగా గురువు రాందేవ్ బాబా నిజామాబాద్ జిల్లాకు వచ్చినపున్పడు డిచ్పల్లికి చెందిన యోగా ట్రైనర్ గణేష్ తనను తీసుకెళ్లి రాందేవ్బాబాకు చూపించాడు. రాందేవ్ బాబా కొన్ని ఆయుర్వేద మందులు ఇచ్చి యోగా చేయమని సలహా ఇచ్చాడు. మందులు వాడుతూ గణేష్ నేర్పించిన యోగాసనాలను చేయడం వల్ల శ్రీనివాస్ కొన్ని రోజుల తర్వాత ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్నాడు. దీంతో అతడే ప్రతి రోజూ యోగా చేయడం అలవాటుగా మార్చుకొని, పతంజలి యోగా సంస్థ ఆధ్వర్యంలో యోగా టీచర్గా శిక్షణ పూర్తి చేశాడు. అనంతరం గ్రామంలోని పలువురికి యోగా నేర్పడం ప్రారంభించి, యోగా గురువుగా మారాడు.
తన వ్యాధిని నయం చేసుకోడానికి యోగా నేర్చుకొని గురువుగా మారిన శ్రీనివాస్
నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి
ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. నిత్యం యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. యోగా, ప్రాణాయామం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకోవచ్చు.
– ముల్క శ్రీనివాస్, యోగా టీచర్, డిచ్పల్లి

నాడు వ్యాధిగ్రస్తుడు.. నేడు యోగా టీచర్