
లక్ష్మణుడు లేని రామాలయం
మీకు తెలుసా?
సీతారాములతో పాటు లక్ష్మణుడి విగ్రహాలు ఉన్న రామాలయాలనే మనం దేశవ్యాప్తంగా చూస్తాం. కానీ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా లక్ష్మణుడి విగ్రహం లేని రామాలయాన్ని నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి గ్రామంలో చూడవచ్చు.
● ఇక్కడ ఉన్న రాముడి విగ్రహం ప్రత్యేకమైంది. విగ్రహంలోని ప్రభపై దశావతారాల రూపాలు, సాలిగ్రామాలు ఉన్నాయి.
● రాముడి ఎడమ తొడపై సీతాదేవి కూర్చోని ఉండటం మరో ప్రత్యేకత.
● సిర్నాపల్లి సంస్థానాదీశురాలైన శీలం జానకీబాయి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి పూజలు చేసేవారని ఆలయ పూజారి తెలిపారు.
● ఈ ఆలయాన్ని ఆరువందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
● ఔరంగజేబు ఆలయాలను ధ్వంసం చేస్తుండగా కొందరు ఇందూరు ప్రాంతం నుంచి విగ్రహాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టించినట్లు చెప్పుకుంటారు.
● ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.
– ఇందల్వాయి

లక్ష్మణుడు లేని రామాలయం