లక్ష్మణుడు లేని రామాలయం | - | Sakshi
Sakshi News home page

లక్ష్మణుడు లేని రామాలయం

Jun 21 2025 3:43 AM | Updated on Jun 21 2025 3:43 AM

లక్ష్

లక్ష్మణుడు లేని రామాలయం

మీకు తెలుసా?

సీతారాములతో పాటు లక్ష్మణుడి విగ్రహాలు ఉన్న రామాలయాలనే మనం దేశవ్యాప్తంగా చూస్తాం. కానీ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా లక్ష్మణుడి విగ్రహం లేని రామాలయాన్ని నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి గ్రామంలో చూడవచ్చు.

● ఇక్కడ ఉన్న రాముడి విగ్రహం ప్రత్యేకమైంది. విగ్రహంలోని ప్రభపై దశావతారాల రూపాలు, సాలిగ్రామాలు ఉన్నాయి.

● రాముడి ఎడమ తొడపై సీతాదేవి కూర్చోని ఉండటం మరో ప్రత్యేకత.

● సిర్నాపల్లి సంస్థానాదీశురాలైన శీలం జానకీబాయి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి పూజలు చేసేవారని ఆలయ పూజారి తెలిపారు.

● ఈ ఆలయాన్ని ఆరువందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

● ఔరంగజేబు ఆలయాలను ధ్వంసం చేస్తుండగా కొందరు ఇందూరు ప్రాంతం నుంచి విగ్రహాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టించినట్లు చెప్పుకుంటారు.

● ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.

– ఇందల్వాయి

లక్ష్మణుడు లేని రామాలయం1
1/1

లక్ష్మణుడు లేని రామాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement