భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

Jun 20 2025 6:37 AM | Updated on Jun 20 2025 6:37 AM

భూ సమ

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

జక్రాన్‌పల్లి : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి మండ లం కేశ్‌పల్లిలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును కలెక్టర్‌ సందర్శించారు. అర్జీదారుల స మస్యలను కలెక్టర్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నా రు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్‌, రిజిస్టర్లను కలెక్టర్‌ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చే శారు. సాంకేతిక అంశాలను జాగ్రత్తగా గమనించాలని, సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కా గా రికార్డులలో పొందుపర్చాలని అన్నారు. వివాదా లు లేని తహసీల్దార్‌ స్థాయిలో పరిష్కరించదగిన ద రఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేయాలని అన్నా రు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయి లో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టి లో పెట్టుకొని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. అర్హులైన వారికి పూ ర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పనిచేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి, భూ సమస్యలకు శా శ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్‌ వివరించారు. వెంట ఆర్మూర్‌ ఆర్డీవో రాజాగౌడ్‌, తహసీల్దార్‌ కిరణ్మయి, ఆర్‌ఐ ప్ర వీణ్‌, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి

వివాదాలు లేనివాటిని

వెంటనే పరిష్కరించాలి

అర్హులకు న్యాయం జరిగేలా

పనిచేయాలి

కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి

బాల్కొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచి తంగా ఇసుక సరఫరా చేసేలా అధికారులు చర్య లు తీసుకోవాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి సూ చించారు. బాల్కొండ మండల కేంద్రంలో నిర్మి స్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన గు రువారం పరిశీలించారు. వర్షాలు కురిస్తే వాగు ల్లో నీటి నిల్వలు చేరి ఇసుక లభించక ఇబ్బంది గా మారుతుందన్నారు. కావాల్సిన ఇసుకను నిల్వ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇసుక కొరతతో నిలిచిపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరింత వేగవంతం చేయాలి

క్షేత్రస్థాయిలో భూమి పరిశీలన కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులకు ఆ దేశించారు. మెండోరా తహసీల్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకున్న మెండోరా మండలంలో ఽభూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్డీవో రాజుగౌ డ్‌, తహసీల్దార్లు శ్రీధర్‌, సంతోష్‌రెడ్డి ఉన్నారు.

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు1
1/1

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement