రూ.214.56 కోట్ల రైతు భరోసా నిధులు జమ | - | Sakshi
Sakshi News home page

రూ.214.56 కోట్ల రైతు భరోసా నిధులు జమ

Jun 20 2025 6:37 AM | Updated on Jun 20 2025 6:37 AM

రూ.21

రూ.214.56 కోట్ల రైతు భరోసా నిధులు జమ

కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుభరోసా పథకం కింద ఇప్పటి వరకు జిల్లాలోని 2, 38,247 మంది రైతుల ఖాతాలలో రూ. 214.56 కోట్ల నిధులు జమ అయ్యాయని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. వానాకాలం – 2025 సీజన్‌కు సంబంధించి జిల్లా లో మొత్తం 2,98,472 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రూ. 326.03 కోట్ల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతా లలో జమ చేస్తోందని అన్నారు. ఈ నెల 5 వరకు కొత్త పాస్‌ పుస్తకాలు వచ్చిన రైతులు వ్యవసాయ విస్తీర్ణాధికారులను కలిసి సరైన పత్రాలను సమర్పించాలని సూచించారు.

భూ భారతిలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పాత్ర కీలకం

నిజామాబాద్‌అర్బన్‌: భూభారతి చట్టం అమలులో లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్‌ గురువారం తనిఖీ చేశారు. అనుభవజ్ఞులైన వారితో అందిస్తున్న సర్వే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు చక్కగా సేవలందిస్తే, అనేక భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దీంతో భూ వివాదాలకు తావు లేకుండా చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుందని అన్నారు. శిక్షణ అనంతరం నిర్ణీత మార్కులతో పాసైన వారికి ప్రభుత్వం సర్టిఫికేట్‌ అందజేస్తుందని తెలిపారు. కలెక్టర్‌ వెంట సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ అశోక్‌, సిబ్బంది ఉన్నారు.

జక్రాన్‌పల్లి వీడీసీ రద్దు

గ్రామస్తుల తీర్మానం

జక్రాన్‌పల్లి : మండల కేంద్రానికి చెందిన గ్రా మాభివృద్ధి కమిటీ(వీడీసీ)ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు జక్రాన్‌పల్లి వీడీసీ సభ్యులు గురు వారం ప్రకటించారు. మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వారు మాట్లాడారు. పోలీస్‌ శా ఖ నిర్వహించిన అవగాహన సదస్సులలో భాగంగా రాజ్యాంగంలోని చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటామని నిర్ణయించుకొ ని గురువారం గ్రామసభ నిర్వహించి ప్రజలంతా కలిసి వీడీసీని రద్దు చేస్తూ తీర్మానం చేశామన్నారు.

కలెక్టర్‌ను కలిసిన

ఎంపీ అర్వింద్‌

సుభాష్‌నగర్‌ : కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి ని గురువారం తన కార్యాలయంలో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం, మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌ ప్రాజెక్టు లు, ఇతరత్రా అంశాలపై ఎంపీ చర్చించారు.

నేడు ఒలింపిక్‌ రన్‌

నిజామాబాద్‌నాగారం : జిల్లా ఒలింపిక్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించబోయే ఒలింపిక్‌ రన్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి తెలిపారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. రన్‌ ప్రారంభోత్సవానికి కలెక్టర్‌, సీపీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని తెలి పారు. రాజరాజేంద్ర చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్‌ రన్‌ గాంధీచౌక్‌, బస్టాండ్‌ మీదుగా కలెక్టర్‌ గ్రౌండ్‌కు చేరుకుంటుందన్నారు. రాజకీయ ప్రముఖులు, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, పాఠశాల ల విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయు లు, సీనియర్‌ క్రీడాకారులు ఒలింపిక్‌ రన్‌లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో చై ర్మన్‌ లింగయ్య, కార్యదర్శి బొబ్బిలి నర్స య్య, భూమారెడ్డి, గాదరి సంజీవరెడ్డి, స్వా మి కుమార్‌, సురేశ్‌ పాల్గొన్నారు.

రూ.214.56 కోట్ల రైతు భరోసా నిధులు జమ 
1
1/2

రూ.214.56 కోట్ల రైతు భరోసా నిధులు జమ

రూ.214.56 కోట్ల రైతు భరోసా నిధులు జమ 
2
2/2

రూ.214.56 కోట్ల రైతు భరోసా నిధులు జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement