చెట్లతోనే మానవ మనుగడ | - | Sakshi
Sakshi News home page

చెట్లతోనే మానవ మనుగడ

Jun 20 2025 6:37 AM | Updated on Jun 20 2025 6:37 AM

చెట్లతోనే మానవ మనుగడ

చెట్లతోనే మానవ మనుగడ

మోపాల్‌ : చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారి (డీసీవో) శ్రీనివాస్‌రావు తెలిపారు. బాడ్సి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రాంగణంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం (ఐవైసీ) – 2025 సందర్భంగా ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ కార్యక్రమంలో భాగంగా గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో మాట్లాడుతూ సహకార సంఘాల ప్రాంగణాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, వాతావరణంలో సమతుల్యత లోపిస్తే అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురవాలంటే తప్పకుండా మొక్కలు విరివిగా నాటాలని సూచించారు. భవిష్యత్‌లో మరిన్ని సహకార సంఘాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నాబార్డ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎన్‌డీసీసీబీ సీఈవో నాగభూషణం వందే, డీజీఎం లింబాద్రి, సొసైటీ చైర్మన్‌ నిమ్మల మోహన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ గోర్కంటి లింగన్న, సొసైటీ వైస్‌ చైర్మన్‌ రాజాకిషన్‌, మానిటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, సొసైటీ కార్యదర్శి నర్సయ్య, మాజీ సర్పంచి మహిపాల్‌రెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

డీసీవో శ్రీనివాస్‌రావు

బాడ్సి సొసైటీలో ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement