
ఏటా ఇదే కోత!
కిసాన్నగర్, వేంపల్లి,
వన్నెల్(బి)లలో..
కిసాన్నగర్, వేంపల్లి, వన్నెల్(బి) గ్రామాల శివారులోని వరద కాలువ వెంట ఇదే పరిస్థితి నెలకొంది. మూడు చోట్ల ఇది వరకే భారీ గండ్లు ఏర్పడ్డాయి. వన్నెల్(బి) వద్ద మరమ్మతులు చేపట్టారు. కిసాన్నగర్, వేంపల్లి శివారులో ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోలేదు. వన్నెల్(బి) వద్ద బోదేపల్లి చెరువు నీరు అలుగు నుంచి భారీ ప్రవహం వస్తుంది. కిసాన్నగర్, బాల్కొండ మండల కేంద్ర శివారులో నాగుల కుంట నుంచి నీరు ప్రవహిస్తుంది. వీటన్నింటికీ సూపర్ పాస్లు నిర్మిస్తే కాలువ కట్ట కోతకు గురికాదు. అంతే కాకుండా నీటి వినియోగం జరుగుతుంది.
బాల్కొండ: ఎస్సారెస్పీ మిగులు జలాలను సద్వినియోగపరిచేందుకు నిర్మించిన వరద కాలువ ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న నీటితో ప్రతి సంవత్సరం కోతకు గురవుతోంది. బాల్కొండ మండలం కేంద్ర శివారులోని అలీం చెరువు నీరు అలుగు పారినప్పుడు మిగులు జలాలు బస్సాపూర్ మీదుగా మాటు కాలువలో ప్రవహించి వరద కాలువలో కలుస్తాయి. ప్రస్తుతం బస్సాపూర్ లిప్టు నీరు కూడా వచ్చి వరద కాలువలోనే కలుస్తుండడంతో కట్ట కోతకు గురవుతోంది. కట్ట మొరం భారీగా కొట్టుకు వచ్చి నీటి ప్రవాహనికి అంతరాయంగా మారుతోంది. బస్సాపూర్ గ్రామస్తులు సొంతగా పైప్లైన్ వేయించి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు కాలువలోకి చేరేలా చేశారు. కానీ, కాలువ ఎగువన ఉన్న నీరు దిగువకు వెళ్లేందుకు సైఫన్ లేదా సూపర్పాస్ నిర్మిస్తే ఆయకట్టుకు దోహదపడుతుంది. అధికారులు అటు వైపు కృషి చేయడం లేదు. ఫలితంగా చెరువు, లిప్టు నీరు కాలువ పాలవుతున్నాయి. మైనర్ ఇరిగేషన్ అధికారులే ఆ పనులు చేపట్టాలని ఎస్సారెస్పీ అధికారులు చెప్తున్నారు. కాగా, వరద కాలువను పర్యవేక్షించే ఎస్సారెస్పీ అధికారులే పనులు చేపట్టాలని మైనర్ ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో మధ్యలో బస్సాపూర్ గ్రామస్తులు నలుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
వరద కాలువలోకి మిగులు జలాలు
కోతకు గురవుతున్న కాలువ కట్ట
మైనర్ ఇరిగేషన్ శాఖను సంప్రదించాలి
వరద కాలువలోకి వచ్చి చేరుతున్న నీటి వినియోగం కోసం మైనర్ ఇరిగేషన్ అధికారులను సంప్రదించాలని సూచించాం. చెరువుల నీరు వినియోగం ఆ శాఖ పరిధిలోకి వస్తుంది.
– గణేశ్, డిప్యూటీ ఈఈ, వరద కాలువ

ఏటా ఇదే కోత!

ఏటా ఇదే కోత!